హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ హైటెక్ సిటీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి, గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 05:19 PM IST
Tags: