శంషాబాద్: షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మేనకోడలు వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులను దీవించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 05:12 PM IST
Tags: